భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా శివ దర్శకత్వంలో తెలుగులోకి విడుదలయిన అనువాద చిత్రం "వీరుడొక్కడే". తమిళంలో వీరం పేరుతో ఈ సినిమాను నిర్మించిన విజయా పిక్చర్స్ తెలుగులో కూడా విడుదల చేసింది. అజిత్ కుమార్, తమన్నా జంటగా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడిగా, వెట్రి ఛాయాగ్రాహకుడిగా, కాశీ విశ్వనాథన్ ఎడిటర్ గా పనిచేసారు. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో 2014 మార్చి 21న భారిగా విడుదలయ్యింది.[1]